ఏపీ పోలీసులకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త అందించింది. పోలీసులకు వారాంతపు సెలవులు అందిస్తామని పాదయాత్రలో జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇచ్చిన హామీని అమలు చేశారు జగన్. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో బుధవారం నుంచి వారాంతపు సెలవుల అమలవుతుందని అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) డాక్టర్ రవిశంకర్ ప్రకటించారు. దీంతో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు డిపార్ట్ మెంట్లో వీక్లీ ఆఫ్ విధానం అమలు చేయనున్నారు.
పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వాలని ఈ మేరకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఈ నెల 3న ఆదేశించారు. అయితే దీనిపై అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో కమిటీ వేయగా, దీనిపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాగా కమిటీ నివేదిక ఈ నెల 12న డీజీపీ కార్యాలయానికి చేరింది. కమిటీ నివేదికలో పోలీసులోకి వివిధ విభాగాలకు చెందిన వారికి వారి ప్రాధాన్యతలను బట్టి వీక్లీ ఆఫ్ ను కేటాయించనున్నారు.