- Advertisement -
ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా స్కాంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఇది చివరకు చిలికి..చిలికి గాలి వాణగా మారింది. ఈ వ్యవహారంపై వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా వైసీపీ నేత బొత్ససత్యనారాయణ ఐటీ మంత్రి నారాలోకేష్పై సంచలన ఆరోపనలు చేశారు. డేటా దొంగతనం కుంభకోణంలో తమ ప్రమేయం లేకుండా లోకేస్ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నారా లోకేశ్ను పిల్లకాకిలా అభివర్నించారు బొత్స. అసలు సూత్రధారుల బాగోతం బయటపడుతుందనే లోకేశ్ భయపడుతున్నారని ఆరోపించారు. ఏ తప్పూ చేయకుంటే చంద్రబాబు, లోకేశ్ ధైర్యంగా విచారణను ఎదుర్కోవాలని సవాలు విసిరారు.