వైయస్ వివేకానందరెడ్డి మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. పోస్ట్ మార్టంలో సంచలన నిజాలు వెల్లడయ్యాయి. ఆయనది హత్యేనని పోస్టుమార్టమ్ రిపోర్ట్లో తేలింది. శరీరంపై 7 బలమైన కత్తి పోట్లు ఉన్నట్లు పోస్ట్మార్టం నివేదికలో రావడంతో పోలీసులు ప్రాధమికంగా ఇది హత్యే నని నిర్దారించారు. కాసేపటి క్రితం వివేకా మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. రిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో పోస్ట్ మార్టం నిర్వహించారు.
వివేకానంద రెడ్డి తల, చేతికి గాయాలయినట్లు సమాచారం . మొత్తం ఆయన ఒంటిపై ఏడు కత్తి పోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. నుదుటిపై లోతైన రెండు గాయాలు ఉన్నట్లు గుర్తించారు. తల వెనుక భాగంలో మరో గాయం ఉన్నట్లు తేల్చారు. తొడ, ఛాతి భాగంలో కూడా గాయాలు ఉన్నాయని అధికారులు తెలిపినట్లు సమాచారం.
పులివెందులలోని స్వగృహంలోనే ఆయన గుండెపోటుతో కుప్పకూలినట్లు తెలిసింది. తెల్లవారుజామున ఆయన మృతి చెందినట్టు సమాచారం. అయితే వివేకా మృతిపై పలు అనుమానాలు వెంటాడుతున్నాయి.పోలీసులకు ఆయన పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. తల, చెయ్యికి గాయాలు కావడంపై అనుమానం మరింత పెరిగింది.
రక్తపు మడుగులో వివేకా బాత్రూంలో పడి ఉండటం చూసి ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తం అవడంతో అయన డెడ్ బాడీని పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టమ్ నిర్వహించారు . పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడంతో ఆయనది సహజ మరణం కాదుదని హత్యేనని తేల్చారు.