Wednesday, May 8, 2024
- Advertisement -

జగన్ రెడ్డి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన మాధవీలత..!

- Advertisement -

బీజేపీ యువ నేత, హీరోయిన్ మాధవీలత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆయన్ని నోటుకి వచ్చినట్లు తిట్టింది. దాంతో మాధవీలతపై వైసీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నారు. అసలు జగన్ పై మాధవీలత ఎందుకు కామెంట్స్ చేయాల్సి వచ్చిందంటే ? విషయంలోకి వెళ్తే.. గత ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది అధిష్టానం.

గెలవడం విషయం పక్కన పెడితే.. జగన్ హవా ముందు ఈమె డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. ఇక బీజేపీ కండువా మెడలో ఉంది కాబాట్టి.. ఆ పార్టీ ఆఫీషియల్ ప్రోగ్రామ్స్‌లో పార్టిసిపేట్ చేస్తోంది మాధవీలత. ఫేస్ బుక్‌లో యాక్టివ్ గా ఉండే మాధవీలత అప్పుడు అప్పుడు రాజకీయా నాయకులపై రెచ్చిపోయి కామెంట్స్ చేస్తూ ఉంటుంది. అలానే తాజాగా జగన్ పై మండిపడింది. ‘జగన్ మోహన్ రెడ్డిని రా.. అంటూ పవన్ కళ్యాణ్ ఆమె పార్టీతో దోస్తీ కట్టారనో ఏమో తెలియదు కాని.. పవన్ మాదిరే జగన్ రెడ్డి అంటూ సంభోదించారు మాధవీలత.

‘ఏమిరా ఇది.. జగన్ రెడ్డి!! కర్నూల్ కోర్టు తరువాత కట్టుకుందువు కాని.. ముందు ఉన్న కోర్టులో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌లో దిశ చట్టం అమలు చేయించు. నువ్వు నీ పిచ్చి తుగ్లక్ గోల’ అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై నోరు పారేసుకుంది మాధవీలత. ఇంతకీ ఈమె ఇంతిలా స్పందించడానికి కారణం ఏంటంటే.. కర్నూల్ బండిమెట్టలో ఆరేళ్ల బాలికపై ఖాజా మోదీన్ అనే వ్యక్తి అత్యాచారం చేశారంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ రావడంతో దాన్ని షేర్ చేస్తూ జగన్‌పై ఈ విధమైన కామెంట్స్ చేశారు మాధవీలత.

అయితే మాధవీలత తెలిసి ఈ కామెంట్స్ చేసిందా ? లేకా తెలియకా చేసిందా ? దిశ చట్టం అప్రూవ్ చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ కదా.. ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం దిశ బిల్లుని సెంట్రల్ గవర్నమెంట్‌కి పంపిస్తే.. దాన్ని తిరిగి పంపేశారు. ఇప్పుడు మాధవీలత దిశ చట్టం చేయమని ఎలా చెప్తుంది ఆమెకు చట్టం గురించి కొచ్చెమైన అవగాహన ఉందా ? కేవలం పాపులారిటీ కోసమ్ నోటికి వచ్చింది మాట్లాడుతుందా ? అంటూ మాధవీలతపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా నువ్వు బీజేపీలోనే ఉన్నావు మోడీని అడుగు ఎందుకు అప్రూవ్ చేయాలేదు అని మధవీలతపై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -