ఏపీలో మాజీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబును భాజాపా చెడుగుడు ఆడుకుంటోంది. ఆపరేషన్ కమలం దెబ్బకు బాబు దిక్కుతోచని స్థితలో పడిపోయారు. ఒక వైపు వలసను ప్రోత్సహిస్తూనె …మరో వైపు తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు కమలం నేతలు. ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సునీల్ దియోధర్ మరో సారి సంలచన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు ఒ గజదొంగ అని పాలన మొత్తం అవినీతిమయమని.. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేశారని మండిపడ్డారు. ఆయనమీద పార్టీ నేతలకే నమ్మకం లేదని విమర్శించారు. అందుకే భాజాపాలో చేరుతున్నారన్నారు. చంద్రబాబు అవినీతికి సంబంధించిన నివేదికలను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పిస్తుందని దేవధర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఐదేళ్లలో టీడీపీ భారీగా అవినీతికి పాల్పడిందని.. అక్రమాలు చేసే నేతలు ఏ పార్టీలో ఉన్నా శిక్ష తప్పదన్నారు. టీడీపీ చేసిన అవినీతిని వెలికితీయాలని జగన్ను ఎన్నోసార్లు కోరామని.. మళ్లీ, మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో భాజాపాపై బాబు తప్పుడు ప్రచారం చేశారని దాన్ని ప్రజలు నమ్మలేదన్నారు.చంద్రబాబుపై సొంత పార్టీ ఎంపీకే నమ్మం లేదన్నారు సునీల్. అందుకే ట్విట్టర్లో ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ.. పరోక్షంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రస్తావన తీసుకొచ్చారు.