Friday, April 26, 2024
- Advertisement -

ఎంపీ బ‌రిలో ఇద్ద‌రు స్టార్ క్రికెట‌ర్లు….?

- Advertisement -

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేసింది. సెల‌బ్రిటీల‌పై దృష్టిసారించింది అధిష్టానం. అన్ని రంగాల సెల‌బ్రిటీలు ఇప్పుడు రాజ‌కీయాల్లో ఉన్నారు. తాజాగా ఇద్ద‌రు స్టార్ క్రికెట‌ర్లు భాజాపాలో చేరుతున్నార‌నే వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. మాజీ క్రికెట‌ర్ గంభీర్‌, వికెట్‌కీప‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోని లు 2019 ఎన్నిక‌ల్లో భాజాపా త‌రుపున ఎంపీలుగా పోటీ చేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇద్ద‌రితో ఇప్ప‌టికే భాజాపా చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు సండే గార్డియ‌న్ పత్రిక త‌న క‌థ‌నం వెలువ‌రించింది. గంభీర్‌ను ఢిల్లీనుంచి ఎంపీ బ‌రిలోకి దింపాల‌ని క‌మ‌దళం ఆలోచిస్తోంది. గంభీర్ స్వ‌స్థ‌లం ఢిల్లీ కావ‌డంతో అత‌నికి క‌ల‌సి వ‌చ్చే అంశం. గంభీర్ మొద‌టినుంచి భాజాపా భావ‌జాలంతో ఉన్నారు. ఇక ధోనీని జార్ఖండ్ నుంచి పోటీ చేయించాల‌ని భాజాపా అగ్ర‌నేత తెలిపిన‌ట్లు స‌మాచారం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -