- Advertisement -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో… ముందే చెప్పినట్లు టీఆర్ఎస్ దూసుకెళ్తోంది. తొలి కౌంటింగ్లో ఆ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. దాదాపు కీలక అభ్యర్థులంతా ఆధిక్యంలోనే ఉన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మూడు రౌండ్లు ముగిసే నాటికి టీఆర్ఎస్ పార్టీ మహాకూటమి కంటే ముందంజలో ఉంది.
సిద్ధిపేటలో హరీష్ రావు ముందంజలో ఉన్నారు. 19,500 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు హరీష్ రావు.
సిరిసిల్లలో కేటీఆర్ ఆధిక్యంలో ఉన్నారు.
కొడంగల్లో కాంగ్రెస్ అభ్యర్ధి రేవంత్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు
మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
ఖైరతాబాద్లో దానం నాగేందర్ ఆధిక్యంలో ఉన్నారు.