Friday, April 26, 2024
- Advertisement -

బాబును ఎవ్వరూ కాపాడలేరు… త్వరలో ఏపీలో టీడీపీ ఖాళీ

- Advertisement -

జగన్ వందరోజుల పాలనపై చంద్రబాబు వ్యాఖ్యలను తిప్పికొట్టారు వైసీపీ నేత సి.రామచంద్రయ్య. మరో ముప్పై ఏళ్లపాటు వైసీపీ అధికారంలో ఉంటుందని భావించిన చంద్రబాబుకు నిద్రపట్టడంలేదని విమర్శించారు. తెలంగాణాలో టీడీపీ ఖాలీ అయ్యిందని ఇక ఏపీలో కూడా పార్టీ ఖాలీ అవుతుందని రామచంద్రయ్య జోష్యం చెప్పారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 100 రోజుల పాలనలో చంద్రబాబు వంద అబద్ధాలు.. 101 కుట్రలు చేశారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగిన మాట వాస్తవమే ఐతే.. నిజంగానే 8మందిని హత్య చేస్తే.. ఎందుకు మీడియాలో రాలేదని….ఎందుకు పోలీసు రికార్డుల్లో ఎక్కలేదని ప్రశ్నించారు.

గ్రామాల్లో జరిగే చిన్న చిన్న గొడవలను తన రాజకీయ ప్రయోజనాల కోసం బాబు పెద్దవిగా చూపుతూ రాద్ధాంతం చేస్తున్నారని రామచంద్రయ్య మండి పడ్డారు. పార్టీ కార్యక్రమాలకు ఎవరూ రాకపోవడంతో బాబు డబ్బులిచ్చి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని ఎద్దే వ చేశారు.

పెయిడ్‌ ఆర్టిస్ట్‌లను తీసుకొచ్చి జగన్‌ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీహయాంలో అధికారులపై పార్టీ ఎంపీలు,ఎమ్మెల్యేలు దాడి చేస్తె వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమామడ్ చేశారు. సీఎం వైఎస్ జగన్ వందరోజుల ప్రజా సంక్షేమ పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు బాబు డ్రామాలాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ నేతలు ఆంబోతుల్లా తయారై రాష్ట్రాన్ని దోచుకున్నారని మండి పడ్డారు. చంద్రబాబుకు నచ్చిన 10 గ్రామాలను ఎంచుకుని.. జన్మభూమి కమిటీల వలన జరిగిన అన్యాయాలపై.. జగన్‌ ప్రభుత్వం వలన జరిగిన మేలుపై చర్చ పెడదాం. అందుకు బాబు సిద్ధమేనా ని సవాల్ విసిరారు. అవినీతి, కుంభకోణాల కేసులనుంచి తప్పించుకొనేందుకు టీడీపీకీ చెందిన కొందరు రాజ్యసభ సభ్యులను భాజాపాలోకి పంపారని వారెవరూ కూడా బాబును కాపాడలేరన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -