వంగవీటి రంగాపై గౌతమ్ రెడ్డి విమర్శలు చేయడం బెజవాడలో ఉద్రిక్తతలకు దారి తీసింది. హటాత్తుగా గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక ఎవరు ఉన్నారనేదివైసిపిలో తీవ్ర చర్చ జరుగుతోంది. వ్యాఖ్యలు వెనుక ఎవరు ఉన్నారుఅనేది ఇప్పుడు పార్టీ నాయకులు అయోమయంలో ఉన్నారు. వెంటనె జగన్ గైతంరెడ్డిని సస్పెండ్ చేశారు. గౌతమ్ రెడ్డి హఠాత్తుగా ఇప్పుడు ఇలా ఘాటైన వ్యాఖ్యలు చేయడం, పార్టీని విమర్శించడం వెనుక కారణాలు ఏమిటని జగన్ ఆరా తీసినట్లు సమాచారం.
గౌతమ్ రెడ్డి అలా మాట్లాడటానికి పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు నేతలు . గౌతమ్ రెడ్డి 2014లో విజయవాడ సెంట్రల్ నుంచి టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ చేతిలో ఓడిపోయారు. ఇటీవల మల్లాది విష్ణుకు టికెట్ ఇచ్చేందుకు జగన్ సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. అందుకె గౌతమ్ రెడ్డి ఒత్తిడికి లోనయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇటీవల నంద్యాల ఉప ఎన్నికలు, కాకినాడ మున్సిపల్ ఫలితాలు వైసిపికి చేదును మిగిల్చాయి. 2019 ఎన్నికలకు ముందు వైసిపికి ఇలాంటి దెబ్బ తగలడం కూడా గౌతమ్ రెడ్డిని ఆలోచింప చేసిందని అంటున్నారు. ఇటీవల నంద్యాల ఉప ఎన్నికలు, కాకినాడ మున్సిపల్ ఫలితాలు వైసిపికి చేదును మిగిల్చాయి. అప్పటికే అసంతృప్తితో ఉన్న గౌతమ్ రెడ్డికి వైసిపి భవిష్యత్తు పైన కూడా అనుమానాలు కలిగాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
గౌతమ్ రెడ్డి ఇటీవల బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణను కలిసి మంతనాలు జరిపినట్లుగా వార్తలు వచ్చాయి. భాజాపాలో టికెట్ కన్ఫమ్ అయినందుకె ఇప్పుడిలా వ్యాఖ్యలు చేశారనె వార్తలు వినిపిస్తున్నాయి.