స్వదేశంలో ఆసిస్తో జరిగే వన్డే, టీ20 సిరీస్తకు ఇవాల భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. టీ20, మొదటి రెండు తరువాత మూడు వన్డేలకు టీమిండియా జట్లను ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేశారు. న్యూజిలాండ్ సిరీస్నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లీ మళ్లీ జట్టులోకి వచ్చాడు. అయితే ఈసిరీస్నుంచి రోహిత్కు విశ్రాంతి ఇవ్వాలని మొదట మేనేజ్మెంట్ భావించింది. కాని రోహిత్ శర్మను రెండు టీ20ల సిరీస్తో పాటు తొలి రెండు వన్డేలకు కూడా ఎంపిక చేస్తూ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ను తిరిగి జట్టులో ఎంపిక కాగా, పేసర్ ఉమేశ్ యాదవ్ కూడా టీ20 జట్టులో స్థానం దక్కి్ంచుకున్నాడు.
ఇక తొలిసారి యువ లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండెకు నేషనల్ టీమ్లో చాన్సివ్వడం విశేషం. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న మార్కండె.. గతేడాది అద్భుతంగా రాణించాడు. ఇంగ్లండ్ లయన్స్తో ఇండియా ఎ ఆడుతున్న మ్యాచ్లోనూ మార్కండె ఐదు వికెట్లు తీసుకున్నాడు.తొలి రెండు వన్డేల్లో పేస్ బౌలర్ సిద్దార్థ్ కౌల్కు అవకాశం ఇవ్వగా.. తర్వాతి మూడు వన్డేల్లో అతని స్థానంలో భువనేశ్వర్కు అవకాశమిచ్చారు. మరో వైపు కెఎల్ రాహుల్ అన్ని జట్లలోనూ స్థానం సంపాదించాడు.