Friday, April 26, 2024
- Advertisement -

పాక్ కు రాం….రాం…. షాక్ ఇచ్చిన శ్రీలంక క్రికెటర్లు

- Advertisement -

పాక్ క్రికెట్ బోర్డుకు శ్రీలంక క్రికెటర్లు బిగ్ షాక్ ఇచ్చారు. పాక్ పర్యటనను పది మంది లంక క్రికెటర్లు వ్యతిరేకించారు. అవసరం అయితే టూర్ నుంచి తప్పుకునేందుకు సిద్దమయ్యారు.సెప్టెంబరు 27 నుంచి శ్రీలంక జట్టు పాకిస్థాన్ గడ్డపై 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్ లు ఆడాల్సివుంది.

శ్రీలంక టి20 జట్టు కెప్టెన్ లసిత్ మలింగ సహా 10 మంది ఆటగాళ్లు పాకిస్థాన్ వెళ్లకూడదని నిశ్చయించుకున్నట్టు శ్రీలంక క్రికెట్ వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్ వెళ్లాలా? వద్దా? అనేది తాము ఆటగాళ్లకే వదిలేశామని శ్రీలంక క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.

2009 లో పాక్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా లాహోర్ లో శ్రీలంక ఆటగాళ్ల బస్సుమీద ఉగ్రదాడి జరిగింది. ఈ ప్రమాదంలో లంక ఆటగాళ్లు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కొంత మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతరం విదేశీ జట్లు పాకిస్థాన్ లో పర్యటించాలంటే హడలిపోయే పరిస్థితి ఏర్పడింది.

పాక్ పర్యటనను వ్యతిరేకించిన వారిలో ఏంజెలో మాథ్యూస్, తిసర పెరెరా, నిరోషన్ డిక్వెలా, కుశాల్ పెరెరా, ధనంజయ డిసిల్లా, అఖిల ధనంజయ, సురంగ లక్మల్, దినేశ్ చాందిమల్, దిముత్ కరుణరత్నే కూడా ఈ టూర్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -