Friday, April 26, 2024
- Advertisement -

స్నేహితుడి పాదాభివంద‌నంతో పుల‌కించిన స‌చిన్‌….

- Advertisement -

సచిన్‌ తెందుల్కర్‌-వినోద్‌ కాంబ్లి వీరిద్దరి స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ కొన్నాళ్లు ఇద్దరి మధ్య మాటలు లేవు. ఈ మధ్య కాలంలోనే తిరిగి కలుసుకున్నారు. గత ఏడాది కాంబ్లి పుట్టిన రోజు వేడుకల్లో సచిన్‌ పాల్గొన్నాడు. అప్పట్లో ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కూడా కొట్టాయి.

వీరిద్దరూ బాల్య స్నేహితులు. ప్రధానంగా క్రికెట్‌లో సమకాలీకులు. ఒకే పాఠశాల, ఒకే రాష్ట్ర జట్ల తరపున ఆడటంతో పాటు దేశానికి కూడా ప్రాతినిధ్యం వహించారు. అయితే ఆ మధ్య వీరిద్దరి మధ్య కాస్త దూరం పెరిగినా ఇప్పుడు మళ్లీ ఒక్కటయ్యారు. ముంబై టీ20 లీగ్‌ సందర్భంగా వీరి మధ్య చోటు చేసుకున్న ఓ సరదా సన్నివేశం ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఈ మధ్య ముంబయి టీ20 లీగ్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ లీగ్‌కు సచిన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ వ్యవహరించాడు. తాజాగా ఈ లీగ్‌ ముగింపు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సచిన్‌ తెందుల్కర్‌, సునీల్‌ గావస్కర్‌ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ట్రయంప్‌ నైట్స్‌ ముంబయి నార్త్‌ ఈస్ట్‌తో జరిగిన ఫైనల్లో శివాజి పార్క్‌ లయన్స్‌ జట్టు మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. లయన్స్‌ జట్టుకు కాంబ్లి కోచ్‌గా వ్యవహరించాడు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా లయన్స్‌ జట్టుకు మెడల్స్‌ అందజేస్తున్నారు.

రన్నరప్‌ మెడల్‌ను కాంబ్లీకి గవాస్కర్‌ అందించాల్సి ఉండగా.. ఎవరూ ఊహించని విధంగా కాంబ్లీ పక్కనే ఉన్న తన స్నేహితుడు సచిన్‌ కాళ్లకు పాదాభివందనం చేయడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. వెంటనే తేరుకున్న సచిన్‌.. కాంబ్లీని లేపి గట్టిగా హత్తుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -