Sunday, May 19, 2024
- Advertisement -

బాబును భయపెడుతున్న స్వామీజీలు..!

- Advertisement -

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని స్వామీజీలు వణికిస్తున్నారు. అసలే నమ్మకాలు.. విశ్వాసాలు కొంచెం ఎక్కువగా ఉన్న బాబుగారికి స్వామీజీల మాటలు వణుకుపుట్టించేవిలా ఉన్నాయి.

అసలు బాబు ప్రమాణస్వీకారం చేసిన సమయమే సరికాదని వారు అంటున్నారు. ఈ మేరకు విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద సరస్వతి చేసిన వ్యాఖ్యానాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 

ఇది వరకూ కూడా ఈ స్వాములోరు తెలుగుదేశం అధినేత కు వణుకు పుట్టించే ప్రకటన ఒకటి చేశారు. తెలుగుదేశం అధినేత ఏపీ ముఖ్యమంత్రిగా ఉంటే కరువు పరిస్థితులు ఏర్పడతాయి అని స్వామీజీ వ్యాఖ్యానించారు. అది శాసనమన్నట్టుగా స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యానించారు. ఇక బాబు ప్రమాణ స్వీకార ముహూర్తాన్ని అప్పట్లోనే చాలా మంది తప్పుపట్టారు.

బాబు ముఖ్యమంత్రి బాధ్యలు స్వీకరిస్తున్న సమయం సరి అయ్యింది కాదని వారు అన్నారు. ఇప్పుడు స్వరూపానంద సరస్వతి మరోమారు అదే మాట మాట్లాడారు. బాబు ఇప్పుడు ఓటుకు నోటు వివాదంలో ఇరుక్కోవడానికి కూడా ఇదే కారణమని ఆయన అన్నారు. మహూర్తబలం లేకపోవడం వల్లనే ఇదంతా జరుగుతోందని అన్నారు. మరి ఏదేమైనా స్వామీజీల మాటలు మాత్రం తెలుగుదేశాధినేతను భయపెట్టేవిలాగానే ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -