వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బంగాల్లో అధికార టీఎంసీలోని అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. సీఎం మమత బెనర్జీకి షాక్ ఇస్తూ తమ అసమ్మతిని బహిర్గతం చేస్తున్నారు పలువురు సీనియర్ నేతలు. మమతకు అత్యంత విశ్వాస పాత్రుడని గుర్తింపు ఉన్న తృణమూల్ కీలక నేత సువేందు అధికారి.. కేబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. లేఖను మమతకు ఫ్యాక్స్ ద్వారా పంపారు. ఈ విషయాన్ని గవర్నర్కు ఈమెయిల్ ద్వారా తెలియజేశారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని కోరారు.
గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు సువేందు. కేబినెట్ సమావేశాలకు కూడా హజరుకావడం లేదు. పార్టీ అధిష్ఠానంపై ఆయన అసంతృప్తితో ఉండటమే ఇందుకు కారణం. సువేందు భాజపాలో చేరుతారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
మరోసారి ముఫ్తీ గృహ నిర్బంధం..!
తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?