ఉత్తమ నటనకు పురస్కారాలు కొలమానం కాదు. అవార్డులు ఒక ప్రోత్సాహ సూచిక. మెచ్చే అభినయం, ఆకట్టుకున్న భావాలు, పాత్రలో లీనమై చేసిన నటన.. ఇవన్నీ నటీనటులను పురస్కారాలకు చేరువ చేస్తాయి. భారతదేశంలో నటీనటులకు అత్యుత్తమ పురస్కారం జాతీయ చలనచిత్ర అవార్డులు. తెలుగు సినిమాల్లో ఉత్తమ నటిగా పురస్కారాలు అందుకున్నవారు నలుగురు. వారి గురించి..
శారద – నిమజ్జనం (1976)
తెలుగు సినిమాల్లో ఉత్తమ నటి పురస్కారం అందుకున్న తొలి ఘనత నటి శారదకు చెందుతుంది. ఈ సినిమాకంటే ముందే రెండు సార్లు ఉత్తమ నటిగా ఊర్వశి అవార్డు అందుకుని ఆమె ‘ఊర్వశి శారద’ అనిపించుకున్నారు. అయితే అవి రెండూ మలయాళం సినిమాలు. 1976లో దర్శకుడు బి.ఎస్.నారాయణ తీసిన ఈ చిత్రంలో ఆమె నటన అజరామరం అనిపిస్తుంది. తండ్రి అస్థికలు గంగలో నిమజ్జనం చేసేందుకు కాశీకి వెళ్తున్న ఓ బ్రాహ్మణ భార్యాభర్తలకు ఎదురైన అనుభవాలే ఈ సినిమా కథ. ఇందులో బండి నడిపేవాడి చేతిలో అత్యాచారానికి గురైన మహిళగా శారద నటన అద్భుతం.
అర్చన – దాసి(1988)
బి.నరసింగరావు దర్శకత్వంలో 1988లో వచ్చిన దాసి తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి. తెలంగాణ గడీలోని దాసీల బతుకులపై తీసిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందింది. ఇందులో దాసి కమలాక్షిగా నటించిన అర్చన జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా పురస్కారం అందుకున్నారు. అది ఆమె రెండో పురస్కారం కావడం విశేషం.
విజయశాంతి – కర్తవ్యం (1990)
మోహన్గాంధీ దర్శకత్వంలో ఏ.ఎం.రత్నం నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. విజయశాంతి కెరీర్లో అతిపెద్ద హిట్గా నిలిచి, ఆమెకు హీరోలతో సమానమైన ఇమేజ్ని తెచ్చిపెట్టింది. భారతదేశ తొలి మహిళా ఐఏఎస్ అధికారి కిరణ్బేబీ స్ఫూర్తితో తీసిన ఈ సినిమాలో విజయశాంతి పోలీస్ ఆఫీసర్గా నటించారు. ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం అందుకున్నారు.
కీర్తి సురేష్ – మహానటి (2019)
మహానటి సావిత్రి జీవితం ఆధారంగా దర్శకుడు సుమంత్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేష్కు జాతీయ స్థాయిలో పురస్కారం అందించింది. సావిత్రి పాత్రలో కీర్తి అద్భుతంగా నటించి, మెప్పించారు.
మాయాబజార్ సినిమాలో.. భలే భలే టైటిల్స్!
ఎప్పటికీ గుర్తుండిపోయే జయమాలిని ఐటమ్ సాంగ్స్..!