దర్శకుడు డాలీ డైరెక్షన్ లో.. పవర్స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న సినిమ ‘కాటమరాయుడు’. ఈ సినిమాని పవన్ ప్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఇటివలే ఈ సినిమా బృందం సక్సెస్ఫుల్ గా పొల్లాచ్చిలో షూటింగ్ కంప్లీట్ చేసుకొని.. హైదరాబాద్కి తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా.. చిత్ర నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ ” సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ కావచ్చింది. ‘గబ్బర్ సింగ్ ఘనవిజయం తరువాత పవన్ కల్యాణ్, శృతి హాసన్ల కాంబినేషన్ “కాటమరాయుడు”లో మరోసారి కనువిందు చేయబోతోంది.
“పొల్లాచ్చిలో పవన్ కల్యాణ్, శ్రుతి హాసన్ కాంబినేషన్లో వచ్చే సీన్స్, సాంగ్స్ షూట్ చేసాం.. అవి చాలా బాగా వచ్చాయని” నిర్మాత శరత్ మరార్ చెప్పారు. దర్శకుడు డాలీ.. పవన్ తో రెండోవ సినిమా చేయడం చాలా అనందగా ఉంది.. మిగిలిన షూటింగ్ పార్ట్ జనవరి, ఫిబ్రవరి నెలల్లో పూర్తి చేయటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో ‘ఉగాది’ కి విడుదల అవుతుంది అన్నారు. పవన్, శృతి కాంబినేష లో వచ్చిన గబ్బర్ సింగ్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న కాటమరాయుడు కూడా సూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక్ ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
Related
