సాకుగా చూపి కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తున్నారు..!

రాబోయే మూడేళ్లు పాటు జై జవాన్​, జై కిసాన్ నినాదంతో ముందుకెళ్తున్నట్లు కాంగ్రెస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోదీ ఒక్కటయ్యారని రేవంత్​రెడ్డి ఆరోపించారు. సమస్యల మీద మనమే పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర భవిష్యత్​ కోసం ఇంటికొకరు చొప్పున యువత బయటకు రావాలని కోరారు.

పార్టీ నేతలు మల్లు రవి, ఎమ్మెల్యే సీతక్క సూచనలతో రాజీవ్​ రైతు భరోసా యాత్రను చేసినట్లు రేవంత్​రెడ్డి వివరించారు. సోనియా గాంధీ ఆదేశాల మేరకు రైతులకు అండగా నిలిచేందుకు పదిరోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఉమ్మడి మహబూబ్​నగర్, రంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది తనకు అండగా నిలిచారని పేర్కొన్నారు.

కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలో వ్యవసాయ శాఖ ఉన్నందున నూతన సాగుచట్టాలను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించవచ్చన్నారు. వాటిని సాకుగా చూపి కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తున్నారని రేవంత్ ఆరోపించారు.

పాన్ ఇండియా లెవెల్ లింగు సామి తో సినిమా చేస్తున్న రామ్?

ఎన్టీఆర్ కి షాక్ ఇచ్చిన జబర్ధస్త్ కమెడియన్!

ప్రొడ్యూసర్ గా మారబోతున్న రవి తేజా..!