భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ తిరిగి రింగ్లోకి అడుగుపెట్టనున్నాడు. కొవిడ్ కారణంగా ఏడాది కాలంగా ఆటకు దూరంగా ఉన్న అతడు.. వచ్చే నెలలో భారత్లో జరుగుబోయే పోటీల్లో బరిలోకి దిగుతాడని ప్రమోటర్లు పేర్కొన్నారు.
ఎట్టకేలకు విజేందర్తో పోటీకి దిగబోయే ప్రత్యర్థి పేరును, తేదీని, వేదికను ప్రమోటర్లు నిర్ణయిస్తారు. అతడు మార్చి నెలలో తిరిగి రింగ్లోకి అడుగుపెట్టనున్నాడు. విజేందర్ ఇప్పటికే 12 వరుస విజయాలతో ఉన్నాడు. ఆ రికార్డును కొనసాగించేందుకు పోటీలోకి దిగనున్నాడు” అని ఐఓఎస్ బాక్సింగ్ ప్రమోషన్స్ ప్రకటించింది.
విజేందర్ చివరిసారిగా.. 2019 నవంబర్లో దుబాయ్ వేదికగా జరిగిన డబ్ల్యూబీఓ ఆసియా పసిఫిక్ మిడిల్వెయిట్ ఛాంపియన్ పోటీల్లో పాల్గొన్నాడు. ఆ గేమ్లో ప్రత్యర్థి ఛార్లెస్ ఆడమ్ను ఓడించి వరుసగా 12వ విజయాన్ని నమోదు చేశాడు.
ఉప్పెన’ గురించి సూపర్ స్టార్ మహేష్ ఏమన్నాడో తెలుసా?
ఓటీటీ లో విడుదల చెయ్యడం వలన భారీగా నష్టపోయిన దృశ్యం 2…!
నోటి పూత సమస్యతో బాధపడుతున్నారా? ఇలా చేసి ఉపశమనం పొందండి !