ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్కు ఇటీవలే తగిలిన గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి మరో 6-9 నెలలు పడుతుందని వైద్యులు స్పష్టం చేశారు. కానీ, వచ్చే వారమే తాను బరిలోకి దిగుతానని వార్నర్ అంటున్నాడు.
నవంబరులో భారత్తో రెండో వన్డే సందర్భంగా అతడు గాయపడ్డాడు. దాంతో మూడో వన్డే, టీ20 సిరీస్తో పాటు తొలి రెండు టెస్టులు దూరమయ్యాడు. తన గాయం తగ్గడానికి 6-9 నెలలు పట్టొచ్చని వార్నర్ వ్యాఖ్యానించడం వల్ల అతడు ఐపీఎల్కు దూరమైనట్లేనని చాలా మంది భావించారు. అయితే తన మాటలు కలకలం రేపిన నేపథ్యంలో వార్నర్ వివరణ ఇచ్చాడు.
నా గాయం పూర్తిగా మానడానికి 6-9 నెలలు పట్టొచ్చని, ఈ కాలంలో నొప్పిని భరించక తప్పదని నేను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలనుకుంటున్నా. నేను మార్చి 4న తిరిగి మైదానంలో అడుగుపెట్టబోతున్నా. న్యూసౌత్వేల్స్ తరఫున ఆడతా” అని వార్నర్ ట్వీట్ చేశాడు. వార్నర్ ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
స్టూడెంట్స్ ఎమోషన్… వైఎస్ షర్మిళా రియాక్షన్…
ఆ రెండు నియోజకవర్గాల అభ్యర్థులు వీరే..?
వార్డుల విభజనకి షెడ్యూల్ విడుదల.. మీది ఏ వార్డు..!
కిడ్నాప్, రేప్ డ్రామా ఆడిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య!