భారత్లో కరోనా కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రధాన నగరాల్లో కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. మహారాష్ట్రలో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. గతేడాది వైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత ఎన్నడూ లేని స్థాయిలో ఒక్కరోజే 27,126 కేసులు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం శనివారం ప్రకటించింది.
మహారాష్ట్రలోని కొన్ని నగరాల్లో ఇప్పటికే పూర్తిస్థాయి లాక్డౌన్ అమలవుతోంది. అయితే… ఈ ఆంక్షల నడుమే స్టేట్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు అక్కడి అధికారులు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
మధ్యప్రదేశ్లోని భోపాల్, ఇందోర్, జబల్పూర్ తదితర నగరాల్లో ప్రతి ఆదివారం లాక్డౌన్ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా.. ఆయా నగరాల్లోని రహదారులు నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలు తెరుచుకోలేదు. అయితే నిత్యావసర వస్తువులు, సేవలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ నెలాఖరు వరకు కళాశాలలు, పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
మహారాష్ట్ర లో మరోగోల..లేఖ వేరే మెయిల్ ఐడీ నుంచిరాలేదు..!