పీపుల్ మీడియా బ్యానర్ పై రవితేజ దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందని గతంలో టాక్ నడిచింది. అయితే కొంత కాలం తర్వాత వివిధ కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అంతేకాక.. ఇదే కథను దర్శకుడు త్రినాథరావు .. వరుణ్తేజ్ కు వినిపించాడని .. కథ అతడికి నచ్చిందని ఈ సినిమా వరుణ్- త్రినాథరావు కాంబినేషన్లో రాబోతుందని వార్తలు వచ్చాయి. దీంతో రవితేజ మూవీ ఆగిపోయిందని భావించారంతా? కానీ ఇప్పుడు ఓ ట్విస్ట్ ఇచ్చింది పీపుల్ మీడియ బ్యానర్.
‘ రవితేజ – త్రినాథరావు కాంబోలో మూవీ ఆగిపోలేదు. అది తెరకెక్కబోతున్నది. త్రినాథరావు.. వరుణ్ తేజ్తో నూ మరో సినిమాను తీయబోతున్నాడు. ఆ మూవీకి .. ఈ మూవీకి ఏ విధమైన సంబంధం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది పీపుల్ మీడియా బ్యానర్ . దీంతో రూమర్స్కు చెక్ పడింది. అయితే రవితేజకు గతంలో రెమ్యునరేషన్ విషయంలో తేడా కొట్టి ఈ మూవీని వద్దనుకున్నాడట. ప్రస్తుతం అంతా సెట్ కావడంతో ఓకే చెప్పాడట మాస్ మహారాజ.
త్రినాథరావు గతంలో నేను లోకల్, సినిమా చూపిస్త మావ వంటి చిత్రాలను తెరక్కెంచాడు. కామెడీ సీక్వెన్స్ తీయడంలో త్రినాథరావుది అందెవేసిన చెయి.. కానీ అప్పుడప్పుడు సీరియస్ సబ్జెక్టు చేసి చేతులు కాల్చుకుంటూ ఉంటాడు. మొత్తానికి త్రినాథరావు – రవితేజతో కాంబోలో వచ్చేది. కామెడీ సబ్జెక్టా. సీరియస్ సబ్జెక్టా అనేది వేచి చూడాలి.
Also Read
మీ దంతాలు పసుపురంగులో ఉంటే.. ఈ చిట్కాలు మీ కోసం !