బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో విద్యాబాలన్ ఒకరు. కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా ధారావాహిక కార్యక్రమాలలోనూ వాణిజ్య ప్రకటనలను చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న విద్యాబాలన్ స్టార్ హీరోయిన్ గుర్తింపును సంపాదించుకున్నారు. ఎక్కువగా లేడి ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యతనిచ్చే ఈమె ప్రస్తుతం కొన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
ఇక తాజాగా విద్యాబాలన్ “షేర్నీ” అనే సినిమాలో నటించి ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విద్యాబాలన్ తన మొదటి సంపాదన గురించి ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎంత సంపాదించినప్పటికే వారి మొదటి సంపాదన ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది.
Also read:అర్ధరాత్రి 12 గంటలకు విడుదల కానున్న ధనుష్ సినిమా..?
ఈ క్రమంలోనే విద్యాబాలన్ తన మొదటి సంపాదన గురించి తెలియజేశారు. విద్యాబాలన్ మొట్టమొదటిసారిగా టూరిస్ట్ క్యాంపైన్ కోసం కెమెరా ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా విద్యాబాలన్, తన సోదరి,మరో కజిన్ ఫ్రెండ్తో కలిసి టూరిస్ట్ క్యాంపైన్ ఫొటోషూట్లో పాల్గొన్నారు. ఈ షూట్ లో భాగంగా వీరందరూ కలిసి ఓ చెట్టు దగ్గర నిలబడి నవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా ఆరోజు కెమెరా ముందు నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చినందుకు గాను వారు ప్రతి ఒక్కరికి 500 రూపాయలను ఇచ్చారు. ఆ 500 రూపాయలు తన మొదటి సంపాదన అని విద్యాబాలన్ ఈ సందర్భంగా తెలియజేశారు.
Also read:మరోసారి నగ్నంగా రెచ్చిపోయిన కియారా.. ఫోటోలు చూస్తే?