యువ హీరో రాపో (రామ్ పోతినేని) తమిళ మాస్ దర్శకుడు లింగుస్వామితో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. ఇక ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్గా ఖరారైంది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే హైదరాబాద్లోని సారథి స్టూడియోలో ఓ పాట కూడా చిత్రీకరించారు. ఇదిలా ఉంటే ఈ మూవీని ఆపాలంటూ నిర్మాత జ్ఞానవేల్ రాజా డిమాండ్ చేస్తున్నాడు. ఈ మేరకు ఆయన తమిళ నిర్మాతల చాంబర్లో ఫిర్యాదు చేశారు.
రామ్కు ఫోన్ చేసి సినిమాను ఆపాలని కోరాడట. అందుకు కారణం దర్శకుడు లింగుస్వామి.. గతంలో జ్ఞానవేల్తో ఓ సినిమా చేస్తానని ఒప్పుకున్నాడు. ఇందుకోసం అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. కానీ వివిధ కారణాలతో ఆ మూవీ ఆగిపోయింది. అయితే ప్రస్తుతం ఆ చిత్రాన్ని పక్కకు పెట్టిన లింగుస్వామి.. రామ్ పోతినేని తో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు.
Also Read: ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ లో అర్జున్రెడ్డి ..!
తన చిత్రం పక్కకు పెట్టి తెలుగు సినిమా ఎలా చేస్తావంటూ జ్ఞానవేల్ మండిపడుతున్నాడు. ఆ మేరకు ఆయన ఇప్పటికే పలు పత్రికా సమావేశాలు నిర్వహించి లింగుస్వామి తీరును తప్పుబడుతున్నాడు.ఓ వైపు కోలీవుడ్ లో ఇందుకు సంబంధించిన వివాదం నడుస్తుండగానే.. రామ్ మాత్రం తన మూవీ చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. రామ్ తండ్రి కూడా స్వయంగా నిర్మాత. ఈ క్రమంలో ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో వేచి చూడాలి.
సినీ పరిశ్రమల్లో ఇటువంటి వివాదాలు కామనే. చాలా మంది నిర్మాతలు, దర్శకులు, హీరోల నడుమ ఇటువంటి గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే అప్పుడప్పుడూ ఇవి చిలికి చిలికి గాలివానగా మారే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం తమిళనాట ప్రముఖ దర్శకుడు శంకర్.. లైకా నిర్మాణ సంస్థకు సైతం గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం కోర్టు దాకా వెళ్లింది. మధ్యే మార్గంగా ఓ విచారణకమిటీని వేసింది కోర్టు.
Also Read: పవన్ కు కథ వినిపించడంపై విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ..!