మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన 15 చిత్రంగా ఓ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్లో నటించనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అప్డేట్ కోసం ఫ్యాన్స్ పిచ్చి పిచ్చిగా ఎదురుచూస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం గురించి చర్చించేందుకు చెర్రీ, దిల్రాజు చెన్నై వెళ్లారు. వారికి శంకర్ తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ పిక్ను చెర్రీలో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆర్సీ 15 కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెర్రీ పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే శంకర్ ఇండియన్ 2 మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. నిర్మాణ సంస్థ లైకాతో గొడవ కారణంగా ఈ ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి. ఇక హీరో కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ మాత్రమే ఇండియన్ 2ను పక్కకు పెట్టి వేరే ప్రాజెక్టులకు కమిట్ అయ్యారు. ఇదిలా ఉంటే లైకా సంస్థ కోర్టుకకెళ్ళింది. ప్రస్తుతం ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తుంది. ఈ మూవీ షూటింగ్ తొందరగా పూర్తిచేసుకొని.. లేదంటే ఆ లోపే ఆర్సీ 15 ప్రారంభించే చాన్స్ ఉంది.
Also Read: మాస్ డైరెక్టర్తో విజయ్ దేవరకొండ మూవీ?
ప్రస్తుతం చెర్రీ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్, చిరంజీవి ఆచార్యలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన వెంబడే.. శంకర్ సినిమా షెడ్యూల్ ప్రారంభించే చాన్స్ ఉంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు.