Wednesday, May 1, 2024
- Advertisement -

‘అలవైకుంఠపురములో ’ హిందీ రీమేక్​లో అల్లు అర్జున్​ గెస్ట్ రోల్​..!

- Advertisement -

తెలుగులో సూపర్​సక్సెస్​ అయిన అలవైకుంఠపురములో చిత్రాన్ని హిందీలో రీమేక్​ చేయబోతున్న విషయం తెలిసిందే. ‘షహజాదా’ గా ఈ మూవీ హిందీలో తెరకెక్కబోతున్నది. హిందీలో కార్తీక్​ ఆర్యన్​, కృతి సనన్​ జంటగా నటిస్తున్నారు. ఇక పరేశ్​ రావల్​, మనీషా కోయిరాలా కీలకపాత్రలు పోషిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ తాజా అప్​డేట్ బయటకు వచ్చింది.

హిందీ రీమేక్​లో అల్లు అర్జున్​ గెస్ట్ రోల్ చేయబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్​ పాన్​ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తున్న విషయం తెలిసిందే. పుష్ప కూడా పాన్​ ఇండియా మూవీగా రెండు పార్ట్​లుగా తెరకెక్కబోతున్నది.ఈ చిత్రం ద్వారా అల్లు అర్జున్​ పాన్​ ఇండియా హీరో కాబోతున్నాడు. పుష్ఫ విడుదల కంటే ఈ మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది.

Also Read: ఆ ఇద్దరు హీరోల రేంజ్ ఎక్కడికో.. !

అయితే షహజాదా రీమేక్​లో నటించాలంటూ .. ఆ చిత్ర నిర్మాతలు అల్లు అర్జున్​ను కోరారట. దీనికి ఆయన కూడా ఒప్పుకున్నట్టు సమాచారం. త్వరలో అల్లు అర్జున్​ ఎలాగూ తన సినిమాను బాలీవుడ్​లో విడుదల చేయబోతున్నాడు. ఈ క్రమంలో హిందీలో ముందుగానే ఓ స్ట్రెయిట్​ మూవీలో అతిథి పాత్ర చేస్తే.. బాగుంటుందని బన్నీ భావిస్తున్నట్టు టాక్​.

Also Read: మరోసారి ఎన్టీఆర్ తో పూజా హెగ్డే రొమాన్స్ ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -