తెలుగులో సూపర్సక్సెస్ అయిన అలవైకుంఠపురములో చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. ‘షహజాదా’ గా ఈ మూవీ హిందీలో తెరకెక్కబోతున్నది. హిందీలో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటిస్తున్నారు. ఇక పరేశ్ రావల్, మనీషా కోయిరాలా కీలకపాత్రలు పోషిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ తాజా అప్డేట్ బయటకు వచ్చింది.
హిందీ రీమేక్లో అల్లు అర్జున్ గెస్ట్ రోల్ చేయబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తున్న విషయం తెలిసిందే. పుష్ప కూడా పాన్ ఇండియా మూవీగా రెండు పార్ట్లుగా తెరకెక్కబోతున్నది.ఈ చిత్రం ద్వారా అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో కాబోతున్నాడు. పుష్ఫ విడుదల కంటే ఈ మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది.
Also Read: ఆ ఇద్దరు హీరోల రేంజ్ ఎక్కడికో.. !
అయితే షహజాదా రీమేక్లో నటించాలంటూ .. ఆ చిత్ర నిర్మాతలు అల్లు అర్జున్ను కోరారట. దీనికి ఆయన కూడా ఒప్పుకున్నట్టు సమాచారం. త్వరలో అల్లు అర్జున్ ఎలాగూ తన సినిమాను బాలీవుడ్లో విడుదల చేయబోతున్నాడు. ఈ క్రమంలో హిందీలో ముందుగానే ఓ స్ట్రెయిట్ మూవీలో అతిథి పాత్ర చేస్తే.. బాగుంటుందని బన్నీ భావిస్తున్నట్టు టాక్.
Also Read: మరోసారి ఎన్టీఆర్ తో పూజా హెగ్డే రొమాన్స్ ..!