వంశీ దర్శకత్వం వహించిన అనుమానాస్పదం సినిమాతో కథానాయకిగా గుర్తింపును తెచ్చుకున్నారు హంసానందిని. ఆతర్వాత పలు చిత్రాల్లో కథానాయకిగా నటించారు. ఇటీవలి జైలవకుశ, రాణి రుద్రమ దేవి వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. మిర్చి, అత్తారింటికి దారేది, లెజెండ్ సినిమాల్లో ఐటం సాంగ్స్లు చేశారు.
కాగా హంసానందిని తన ఆరోగ్యంపై షాకింగ్ న్యూస్ను విడుదల చేశారు. నాలుగు రోజుల క్రితం జరిగిన వైద్య పరీక్షల్లో ఆమెకు బ్రెస్ట్ కేన్సర్గా నిర్ధారణ అయినట్లు ఆమె స్వయంగా వెల్లడించారు. రానున్న మూడేళ్లలో ఎన్నో సర్జరీలు సైతం చేయించుకోవాల్సి ఉంటుందో అని తెలిపారు.
‘మా అమ్మ కేన్సర్తో పోరాడిన రోజులు నా జీవింతో పీడకలలు వంటివి. నా జీవితంలో నేను ఒక బాధితురాలిగా ఉండాలను కోవడం లేదు. భయం నిరాశ నాదరికి రాకుండా జాగ్రత్త పడుతున్నాను. కేన్సర్ను జయించి పది మందికి ఒక రోల్ మాడల్గా ఉండాలను కుంటున్నా. సంపూర్ణ ఆరోగ్యంతో మీముందుకు వస్తా అని ఆమె తెలిపారు.
ఆచార్య రీషూట్.. కారణం అదేనట..