వాహనాదారుల పెండింగ్ చలాన్ల చెల్లింపునకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు శుక్రవారంతో ముగియనున్నది. తొలుత మార్చి ఒకటి నుంచి నెలరోజుల పాటు ఈ అవకాశాన్నిచ్చింది. వాహనదారుల నుంచి భారీ స్పందన రావడంతో రాయితీ గడువును ఈ నెల 15 వరకు పొడిగించింది.
ఇప్పటివరకు 2.9 కోట్ల పెండింగ్ చలాన్లు ఉల్లంఘనదారులు చెల్లించారు. తద్వారా ప్రభుత్వానికి 292 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. అధికారులు విధించిన జరిమానాల్లో ద్విచక్రవాహనాలు, ఆటోలకు 75 శాతం, కార్లు, భారీ వాహనాలకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం, కరోనా సమయంలో మాస్క్ ధరించని వారికి 90 శాతం రాయితీ కల్పించారు. అయితే గడువు దాటిన తర్వాత పెండింగ్ చలాన్ల ఉంటే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.