Tuesday, May 14, 2024
- Advertisement -

ఖమ్మం నాదే తేల్చేసిన మాజీ ఎంపీ!

- Advertisement -

రేణుకా చౌదరి…తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్.ముఖ్యంగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. ఖమ్మం నుండి ఎంపీగా గెలిచి, కేంద్ర మాజీ మంత్రిగా కూడా పనిచేశారు రేణుకా. ఇక తెలంగాణ వచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తిరిగి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు రేణుకా.

సోనియా గాంధీని ఖమ్మం నుంచి పోటీ చేయాలని కోరామని, ఆమె నిర్ణయం వెల్లడించే వరకు ఓపికతో ఉండాలని కార్యకర్తలకు సూచించారు. సోనియా గాంధీ పోటీ చేయకపోతే అభ్యర్థిని తానేనని, ఇంకెవరికీ పోటీ చేసే చాన్స్ లేదని స్పష్టం చేశారు. తాను సీటు అడిగితే కాదనేవారు లేరని వెల్లడించారు.

తన దృష్టిలో హిందువుగా పుట్టడం అదృష్టమని ఇందులో బీజేపీ సర్టిఫికెట్ తనకు అవసరం లేదన్నారు. అయోధ్యకు నా ఇష్టం వచ్చిన ప్పుడు వెళ్తా..ఎవరి అనుమతులు అవసరం లేదని తెలిపారు. జిల్లాకు చెందిన మంత్రులు ఖమ్మం అభివృద్ధికి పాటుపడతారన్నారు. పువ్వాడ అజయ్‌ భూఅక్రమాలపై పోరాటం చేస్తామని…పేదలకు న్యాయం చేస్తామన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -