Wednesday, May 15, 2024
- Advertisement -

రాజ్యసభ సభ్యుడిగా టీకాంగ్రెస్ యువనేత..

- Advertisement -

యువతకు పెద్దపీట వేస్తు ముందుకు సాగుతున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇందులో భాగంగా తెలంగాణ రాజ్యసభ సభ్యలుగా ఓ సీనియర్ నాయకురాలికి, మరో యువనేతకు అవకాశం ఇచ్చారు. తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా సంఖ్యా బలం ప్రకారం రెండు కాంగ్రెస్‌కు, ఒకటి బీఆర్ఎస్‌కు దక్కనున్నాయి.

ఈ నేపథ్యంలో సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరితో పాటు యువజన కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్‌కు అవకాశం కల్పించింది కాంగ్రెస్. వాస్తవానికి రెండోస్థానం ఏఐసీసీ సీనియర్ నేతకు అవకాశం దక్కుతుందని భావించిన ఎవరూ ఉహించని విధంగా అనిల్‌కు అవకాశం కల్పించారు.

మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్. 2018లో ముషీరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీసీ సామాజికవర్గానికి చెందటంతో పాటు యువనేతగా ఉండటం కూడా అనిల్ కుమార్ యాదవ్ కు కలిసివచ్చింది. ఇక అంజన్ కుమార్ యాదవ్ … 2004, 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -