ఎమర్జెన్సీ ట్రైలర్‌…రిలీజ్ డేట్ ఫిక్స్

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ దర్శకత్వంలో ఆమె ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ఎమర్జెన్సీ. ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న స‌మ‌యంలో 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు ఎమర్జెన్సీ విధించిన విష‌యం తెలిసిందే.

ఈ సమయంలో దేశ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు..మీడియాపై ఎలాంటి ఆంక్షలు విధించారు వంటి యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. వాస్తవానికి గ‌తేడాది ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సి ఉండ‌గా.. అనుకోని కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది.

ఇక ఇటీవలె సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 17న ప్రేక్షకుల ముందుకు రానున్న‌ట్లు ప్ర‌క‌టించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. జీ స్టూడియోస్‌, మణికర్ణిక ఫిలిమ్స్‌ బ్యానర్లు నిర్మిస్తుండగా అనుపమ్‌ ఖేర్‌, మహిమా చౌదరి, మిలింద్‌ సోమన్‌, శ్రేయాస్‌ తల్పాడే తదితరులు కీలక పాత్రల్లో నటించారు.