Friday, May 2, 2025
- Advertisement -

అమరావతి కట్టేనా?..లేక మళ్ళీ మట్టేనా?

- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఏపీకి రానున్న సంగతి తెలిసిందే. ఏపీ రాజధాని అమరావతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు మోడీ. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ షర్మిలా… ప్రధానికి పలు ప్రశ్నలు సంధించారు.

ఈసారైనా అమరావతి కట్టేనా ? లేక మళ్ళీ మట్టేనా ? అని ప్రశ్నించారు. 10 ఏళ్ల క్రితం మట్టి తెచ్చి మన నోట్లో కొట్టారు. మన ఆశల మీద నీళ్ళు చల్లి వెళ్ళారు..
ఇప్పుడు రాజధాని పునఃశంకుస్థాపనకు వస్తున్న మోడీకి ఇదే అమరావతి మట్టిని బహుమతిగా పంపిస్తున్నాం అన్నారు. ఈ మట్టిని చూసిన ప్రతిసారి 2015లో తొలి శంకుస్థాపనలో ఇచ్చిన హామీలు గుర్తు రావాలి.10 ఏళ్లుగా చేసిన మోసంపై ఆత్మ విమర్శ చేసుకోవాలి అని డిమాండ్ చేశారు.

ఈ మట్టి సాక్షిగా ప్రమాణం చేసి అమరావతిలో మోడీ అడుగు పెట్టాలి… మరోసారి ఇలాంటి మోసం చేయనని ప్రమాణం చేయాలి. విభజన హామీల్లో రాజధాని నిర్మాణం పూర్తిగా కేంద్రం బాధ్యత అన్నారు. ఆ బాధ్యతకు కట్టుబడి ఉన్నానని, ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తా అని రాసి సంతకం పెట్టాలి. మాకు అప్పులు వద్దు. మా భావితరాల మీద ఆ భారం వద్దు. రాజధాని నిర్మాణం కోసం బేషరతుగా రూ.1.50 లక్షల కోట్లను 3 ఏళ్లలో కేంద్రం ఇవ్వాలి. ఈ ప్రకటన మోడీ గారు చేయాలి. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాలి. అలాగే 10 ఏళ్లుగా అమలుకు నోచుకోని విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అన్నారు షర్మిల.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -