- Advertisement -

సైబర్ క్రైమ్‌..ఏపీ వ్యక్తి అరెస్ట్!

- Advertisement -

ఆన్‌లైన్ పెట్టుబడి మోసం కేసులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఒడిశా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడిని ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన వేడ్‌గిరి శ్రీనివాసరావు (39)గా గుర్తించారు.

క్రైమ్ బ్రాంచ్ అధికారుల వివరాల ప్రకారం, సైబర్ మోసగాళ్లు సోషల్ మీడియా వేదికగా ఒక వ్యాపారిని సంప్రదించి, తమ సంస్థలో ట్రేడింగ్ చేయమని నమ్మించారు. 2024 మే 23 నుంచి జూన్ 24 వరకు, సైబర్ మోసగాళ్ల గ్యాంగ్ సభ్యుల సూచనల మేరకు బాధితుడు వివిధ బ్యాంకు ఖాతాలకు మొత్తం రూ. 6.16 కోట్లను బదిలీ చేశాడు.

తర్వాత తన డబ్బును వెనక్కి తీసుకోవాలని బాధితుడు ప్రయత్నించగా, ఆ మోసపూరిత సంస్థ కస్టమర్ కేర్ సిబ్బంది ఖాతాలో ఉన్న మొత్తంలో 20 శాతం చెల్లించాలని చెప్పారు. దీంతో బాధితుడు మరో రూ. 89 లక్షలు జమ చేశాడు. అయినప్పటికీ, ఏదో ఒక కారణం చెబుతూ అతని నిధులను విడుదల చేయడానికి వారు నిరాకరించారు.

తాను సైబర్ మోసానికి గురయ్యానని గ్రహించిన బాధితుడు, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఐదుగురు, పంజాబ్‌లోని లుధియానాకు చెందిన ఒకరు కూడా ఉన్నారు.
ఈ కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు కొనసాగుతోందని క్రైమ్ బ్రాంచ్ అధికారి తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -