రాసలీలల పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వీడియోలపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్రంగా స్పందించారు. తనపై వైరల్ అవుతున్న దృశ్యాలు పూర్తిగా నకిలీవని, అవి ఆధునిక AI సాంకేతికతతో తయారు చేసిన డీప్ ఫేక్ వీడియోలేనని స్పష్టం చేశారు.
“AI టెక్నాలజీని దుర్వినియోగం చేసి నా ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ కట్టుకథలు, అసత్య ప్రచారం మాత్రమే” అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని, తన వ్యక్తిత్వాన్ని మసకబార్చేందుకు పన్నిన కుట్రగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఈ అంశంపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారిక ఫిర్యాదు చేశానని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, అధికారిక ప్రకటనలకే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజలను ఆయన విజ్ఞప్తి చేశారు.
