తనకు పెళ్లయిన తర్వాత గర్భిణి అని లేనిపోని వార్తలు మీడియా రాయడంపై బాలీవుడ్ నటి బిపాసా బసు మండిపడ్డారు. తన చేతిలో ఉన్న హ్యాండ్బ్యాగ్ను కడుపుపై పెట్టుకోవడం వలన ఉబ్బుగా అనిపించింది. ఆ సమయంలో చూసిన మీడియా బిపాసా గర్భవతి అని ఓ తెగ రాయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇదే విషయమై ఇటీవల మీడియా ఆమెను ప్రశ్నించగా ఎదురుదాడి దిగింది. ఏం పెళ్లయినంత మాత్రాన పిల్లల్ని తప్పనిసరిగా కనాలనే నిబంధన లేదని చెబుతోంది. తన లవర్ కరణ్ సింగ్ గ్రోవర్తో 2016లో బిపాసా పెళ్లి చేసుకుంది.
గతేడాది ఇద్దరూ ముంబయిలోని ఓ ఆస్పత్రికి వెళ్లడంతో ‘బిపాసా గర్భిణి’ అంటూ పలు ఆంగ్ల మీడియా వర్గాలు రాసేశాయి. దీనిపై అప్పట్లో బిపాసా స్పందిస్తూ అలాంటిదేమీ లేదన్నారు. ఆ తర్వాత ఓ రోజు బిపాసా తన భర్తతో కలిసి కారులో వెళుతుండగా తన చేతిలో ఉన్న బ్యాగును ఒడిలో పెట్టుకుంది. బ్యాగు రంగు, తాను వేసుకున్న దుస్తుల రంగు ఒకేలా ఉండటంతో అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లకు ఒడిలో ఉన్న బ్యాగు కనపడలేదు. దాంతో బిపాసా గర్భిణి అంటూ మళ్లీ వార్తలు వచ్చాయి.
ఈ విషయమై బిపాసా, కరణ్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భిన్నంగా స్పందించారు. ‘బిపాసా గర్భిణి అయితే ముందు తనకే తెలుస్తుంది అని భర్త కరణ్ చెప్పాడు. ‘ఓ మహిళకు ఇలాంటి ప్రశ్నలు చాలా చిరాకు కలిగిస్తాయి. పిల్లల్ని కనడం అనేది ఓ అద్భుతమైన అనుభూతి. కానీ ఓ మహిళకు ఇంతకు మించిన విషయాలూ ఉంటాయి. పెళ్లయినంత మాత్రాన పిల్లల్ని కనాలన్న నిబంధన ఏమీ లేదుగా?’ అని బిపాసా ప్రశ్నిస్తూ చెప్పింది.