తెలుగు తెరపై జంతువులు ప్రధాన పాత్రల్లో చాలా సినిమాలు వచ్చాయి.అందులో రాజమౌలి తీసిన సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు రవిబాబు డైరెక్సన్లో పంది పిల్ల తెలుగు తెరపై కనువిందు చేయనుంది.
డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ఇమేజ్ను సంపాదించుకున్న డైరెక్టర్ రవిబాబు. కామెడీ, లవ్, హర్రర్, సస్పెన్స్ ప్రాజెక్టులతో తన టాలెంట్ను ప్రువ్ చేసుకున్నాడు. మళ్లీ చాలా రోజుల తర్వాత అదుగో అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఓ పంది పిల్ల ప్రధాన పాత్రగా అల్లిన కథతో దర్శకుడు, నటుడు రవిబాబు ‘అదుగో’ అనే సినిమా రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కోసం రవిబాబే అన్నీ తానై చూసుకుంటున్నాడు.
గతంలో ఓ సారి దాన్ని పట్టుకుని ఏటీఎం ముందు క్యూలో నిలబడి అందరి దృష్టినీ తన సినిమాపైకి తిప్పుకున్న రవిబాబు, తాజాగా పబ్లిసిటీ కోసం మరో ప్రయోగం చేశాడు. పంది పిల్లకు పళ్లు తోముతూ దాన్ని బుజ్జగిస్తూ ఓ వీడియో విడుదల చేశాడు. ఈ వీడియో రవిబాబు తండ్రి, నటుడు చలపతిరావు ఫేస్బుక్లో పోస్ట్ చేయగా బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమా అందర్నీ బాగా నవ్విస్తుందని, మీ ఆశీస్సులు ఈ చిత్రానికి ఉంటాయని ఆశిస్తున్నానని చలపతి రావు పేర్కొన్నారు. మరి ఈసినిమా ప్రేక్షకులను ఎలా అకట్టుకుంటుందో చూడాలి.
https://www.facebook.com/actorchalapathirao/videos/860445727461105/