బిగ్బాస్ రెండో సీజన్ ముగిసి రెండు వారాలు కావస్తున్న ఇంకా ఆ వేడి మాత్రం కంటెస్టెంట్లలో అలానే కొనసాగుతుంది.బిగ్బాస్ ఫైనల్లో విజయం సాధించిన కౌశల్పై బిగ్బాస్ హౌస్మెట్స్ ఏదో ఒక కామెంట్స్ చేస్తునే ఉన్నారు.ఇలా కామెంట్స్ చేసిన వారిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు బిగ్బాస్ విన్నర్ కౌశల్.113 రోజులు నేను వారితో(హౌస్మెట్స్)కలిసి ఉన్నానని,ఒక్కరు కూడా ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పలేదని హౌస్మెట్స్ పై సంచలన కామెంట్స్ చేశాడు కౌశల్.
దీన్ని బట్టి వారి మధ్య ఈగోలు ఏరేంజ్ లో ఉన్నాయో అర్ధమవుతుంది.హౌస్లో ఉన్న సభ్యుల్లో తనకు తనీష్ అసలు నచ్చడని, తనను కొడతానని బెదిరించాడని కామెంట్స్ చేశాడు. నేను విజేతగా నిలవడానికి ప్రేక్షకులు 40 కోట్ల ఓట్లు వేశారని ,వారందరికి కృతజ్ఞతలు తెలిపాడు కౌశల్.ఈ సందర్భంగా కౌశల్ ఆర్మీ గురించి కూడా మాట్లాడాడు కౌశల్.ఇతర కంటెస్టెంట్లను ఎవరు ట్రోల్ చేస్తున్నా.. వారు కౌశల్ ఆర్మీ సభ్యులని అనుకోవడం తప్పు.. నా భార్యని కూడా సోషల్ మీడియాలో ఇతర కంటెస్టెంట్ల ఫాలోవర్స్ ట్రోల్ చేశారంటూ” చెప్పుకొచ్చాడు.