టీడీపీ ఎమ్మెల్యే ,నటుడు బాలకృష్ణ తెలంగాణ ఎన్నికలలో దూసుకుపోతున్నారు.మహకూటమి తరుపున గత నాలుగు రోజులుగా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు.ప్రచారంలో భాగంగా ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు.ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం భారీగా దోచుకుంటోందని ఆయన విమర్శించారు.రాష్ట్రంలో కౌలు రైతులను కేసీఆర్ అసలు రైతులుగానే పరిగణించడం లేదన్నారు. రైతు బంధు పథకం కింద వీరిని చేర్చడానికి కేసీఆర్ నిరాకరిస్తున్నారని ఆరోపించారు.
అభివృద్దిలో లాస్ట్,మద్యం అమ్మకాల్లో మాత్రం టాప్ ప్లేస్లో తెలంగాణ రాష్ట్రం నిలిచిందని బాలకృష్ణ విమర్శించారు.హైటెక్ సిటీ వచ్చిందంటే, సైబరాబాద్ వచ్చిందటే, ఔటర్ రింగ్ రోడ్డు వచ్చిందంటే చంద్రబాబు వల్లేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు మూడ్ వస్తే ఊరుకోరనీ, రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రపంచమంతా తిరుగుతారని బాలయ్య చెప్పారు.టీడీపీ మాజీ ఎంపీ ,దివంగత నటుడు తన అన్న హరికృష్ణ కూతురు సుహాసిని తరుపున ఆయన ఓల్డ్ బోయిన్ పల్లిలో ప్రచారం నిర్వహించారు.