ఎన్నికల ఫలితాల ఎగ్జిట్ పోల్స్ టీడీపీకీ ఆశాజనకంగా లేవు. పూర్తి మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఇప్పటికే అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. అయితే ఇప్పుడు రాష్ట్రంలోని రెండు నియోజక వర్గాలపై అందరి చూపునెలకొంది. ఆరెండు నియోజక వర్గాల్లో మామ, అల్లుడు పోటీచేస్తున్నారు. లోకేష్ మంగళగిరినుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ లోకేష్కు ఒటమి తప్పదనే సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
బాలకృష్ణ హిందూపురం నియోజక వర్గంలోనుంచి మరోసారి పోటీ చేస్తున్నారు.2014 ఎన్నికల్లో ఇదే నియోజక వర్గంనుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఇప్పడు మాత్రం గెలుపు అవకాశాలు కనిపిండంలేదు. బాలయ్య ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుంచి నియోజక వర్గాన్ని ఏనాడు పట్టించుకోలేదు. దీంతో అక్కడి ప్రజల్లో వ్యతిరేకత మూటకట్టకున్నాడు.
అయితే ఇప్పుడు కూడా మరోసారి అదే సెంటీమెంట్ను నమ్ముకున్నాడు.సినీ హీరోగా ప్రేక్షకులను అలరించిన బాలయ్య గత ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాగా… ఆయన వ్యక్తిగతంగా సెంటిమెంట్లు ఎక్కువగా ఫాలో అవుతుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. 2014లో ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఆర్డీటీ స్టేడియంలో బాలకృష్ణ బస చేశారు. అదికూడా స్టేడియంలోని 9వ నెంబర్ గదిలో బస చేశారు. ఇప్పుడు కూడా అదే గదిలో బస చేస్తున్నారు. అప్పటికే ఆ గదిని మరొకరికి కేటాయించిన అధికారులు, బాలయ్య కోరిక మేరకు దాన్ని ఖాళీ చేయించారు. ఈ సాయంత్రం నుంచి బాలయ్య ఇదే గదిలో బస చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి బాలయ్యను సెంటీమెంట్ గెలిపిస్తోందో లేక ముంచుతుందో రేపు తేలనుంది.