టాలీవుడ్లో చాలా మంది బ్యాచ్లర్ ఉన్నారు. ప్రభాస్ దగ్గరి నుంచి రానా, వరుణ్ తేజ్, నితిన్ ఇలా పెద్ద లిస్టే ఉంది. అయితే ఈ బ్యాచ్లర్ లిస్ట్ నుంచి హీరో నితిన్ పేరు తీసే టైం వచ్చింది. గత కొన్ని రోజులుగా నితిన్ పెళ్లి అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ నితిన్ పెళ్లికి సంబంధించిన తాజాగా ఓ అప్డేట్ వచ్చేసింది. యూఎస్కి చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ శాలినిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది.
గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతోంది. రీసెంట్గా నితిన్ పెళ్లి ఏర్పాట్లు కూడా మొదలైపోయాయని తెలుస్తోంది. ప్రేమ పెళ్లే అయినా.. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో అంగరంగ వైభవంగా ఈ పెళ్లిని ఏప్రిల్లో జరుపబోతోన్నట్లు సమాచారం. ఇక నితిన్ పెళ్లికి సంబంధించిన పనులన్నింటిని నితిన్ అక్క.. నిర్మాత నిఖితా రెడ్డి దగ్గరుండి చూసుకుంటోందని తెలుస్తోంది.
దుబాయ్ లాంటి అత్యంత ఖరీదైన నగరంలో అతి కొద్ది మందికి కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖల మధ్య ఈ పెళ్లి జరగనుంది. దుబాయ్ లో పెళ్లి తర్వాత హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ ఉంటుందని తెలుస్తోంది. ఇక నితిన్ ప్రస్తుతం భీష్మ షూటింగ్లో బిజీగా ఉన్నాడు.