ఒకప్పుడు హాలీవుడ్ లో ఫోర్న్ సినిమాల్లో నటించి సంచలనం రేపిన హాట్ బ్యూటీ సన్నీలీయోన్ తర్వాత సల్మాన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ ’ సీజన్ ద్వారా బాలీవుడ్ కి పరిచయం అయ్యింది. 2003 లో జిస్మ్ చిత్రంతో బాలీవుడ్ నటిగా రంగ్ర ప్రవేశం చేసింది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా పెద్దగా సక్సెస్ కాలేదు. దాంతో ఐటమ్ సాంగ్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిది. తెలుగు,మళియాళ, కన్నడ భాషల్లో కూడా తన అందాలు ఆరబోసింది. తన పాత జీవితాన్ని పూర్తిగా వదిలి వేశానని ముగ్గురు పిల్లల్ని దత్తత తీసుకున్నది.
తన భర్త, పిల్లలతో కొత్త జీవితాన్ని గడుపుతున్నా అంటుంది ఈ బ్యూటీ. తాజాగా సన్నీలియోన్ పై కేరళాలో చీటింగ్ కేసు నమోదు అయ్యింది. గత ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా తాను చేయనున్న ఫంక్షన్కు వచ్చేందుకు రూ.29లక్షలు తీసుకున్నారని, కానీ ఫంక్షన్కు హాజరుకాకుండా మోసం చేశారంటూ పెరుంభవూర్కు చెందిన ఆర్ షియాస్ అనే వ్యక్తి కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెను కేరళా పిలిపించి విచారణ చేశారు పోలీసులు.
ఈ సందర్భంగా సన్నీలియోన్ ఆ ఫంక్షన్ అనేక సార్లు వాయిదా వేశారని, ఆ తరువాత కరోనా కారణంగా తాను హాజరు కాలేక పోయానని అన్నట్టు పోలీసులు తెలిపారు. ఇక ఒప్పందం ప్రకారం ఫంక్షన్కు పదిరోజుల ముందే తనకు రూ.12.5లక్షలు ఇస్తానని అతడు చెప్పాడని, కానీ అతడు ఇవ్వలేదని సన్నీ తెలిపారని పోలీస్ అధికారి చెప్పారు. ఇదిలా ఉంటే.. అంతేకాకుండా ఫంక్షన్కు తాను రాలేనని సన్నీ ట్వీట్ చేసినట్లు చెప్పారు. కానీ షేయాస్ మాత్రం ఎఫ్ఐఆర్లో సన్నీ లియోన్ కావాలనే ఫంక్షన్కు హాజరు కాలేదని అన్నారు.