Thursday, April 25, 2024
- Advertisement -

మరో క్రేజీ ప్రాజెక్ట్ లో బిగ్ బీతో ప్రభాస్

- Advertisement -

బిగ్ బీ.. బాలీవుడ్ లోనూ ఇప్పటికీ క్రేజ్ తగ్గని నటుడు. ఆయన వాయిస్ కోట్లాది మందిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. తాజాగా ప్రభాస్ ‘రాధేశ్యామ్’ హిందీ వెర్షన్కు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అంటే సినిమా కథంతా అమితాబే నెరేట్ చేయబోతున్నారన్నమాట.

ఈ విషయాన్ని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. బిగ్బీకి కృతజ్ఞతలు కూడా తెలిపింది చిత్రబృందం. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ … వాయిస్ ఓవర్ ఇస్తుండటంతో రాథేశ్యామ్ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ మూవీని 250 కోట్ల పైగా బడ్జెట్ తో నిర్మించారు.

తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ప్రస్తుతం అమితాబ్, ప్రభాస్ కలిసి ‘ప్రాజెక్టు-కె’లో కలిసి నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో ఈ చిత్రం వస్తోంది. ‘ప్రాజెక్టు-కె సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. ప్రభాస్ సలార్, ఆదిపురుష్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.

పవన్ కల్యాణ్ ను మళ్లీ టార్గెట్ చేసిన ఏపీ సర్కార్

నాని నవ్వుల హోం మొదలైంది

మహేశ్ బాబు తల్లిగా అలనాటి స్టార్ హీరోయిన్ రీఎంట్రీ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -