Wednesday, May 15, 2024
- Advertisement -

ఆ బోల్డ్ పాత్ర చేసి తప్పు చేశాను : రష్మీ గౌతమ్

- Advertisement -

బుల్లితెరపై తన యాంకరింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ రష్మీ. హీరోయిన్స్ కి ఎంత క్రేజ్ ఉందో ఈ యాంకరమ్మకు కూడా అంతే ఉంది. బుల్లితెరపై గ్లామర్ డోస్ పెంచి కుర్రాకారును బాగా ఆకట్టుకుంది. యాంకరింగ్ చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని నిరూపించుకుంది. గత కొన్నేళ్లుగా రష్మీ తన మ్యాజిక్ ను చూపిస్తూ ఎవర్ గ్రీన్ యాంకర్ లా రాణిస్తూనే ఉంది. నిజానికి రష్మీ ముందు వెండితెరపై చిన్న చిన్న పాత్రల్లో మెరిసింది. కానీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది.

అందుకే బుల్లితెరపై రెచ్చిపోయి.. తర్వాత ‘గుంటూరు టాకీస్’ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో అందాలు ఆరబోసి.. యూత్ ఆడియన్స్ ని తన బుట్తలో వేసుకుంది. కానీ సినిమా సక్సెస్ కాపోవడంతో మళ్లీ బుల్లితెరపై తన హవా కొనసాగించింది. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తాను సినిమాల్లో సక్సెస్ కాకపోవడానికి గల కారణాలు చెప్పింది రష్మీ. ఆమె మాట్లాడుతూ.. బుల్లితెరపైన క్రేజ్ సంపాధించుకున్న తర్వాతే వెండితెరపై అవకాశాలు వచ్చాయి. దాంతో ఒక్కో సినిమా చేశాను. ఈ నేపథ్యంలో ‘గుంటూరు టాకీస్’ సినిమా చేశాను.

ఆ సినిమాలో నేను గ్లామర్ డోస్ పెంచి మరి నటించడం చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఆ సినిమా తరువాత కూడా నాకు అదే తరహా పాత్రలు వచ్చాయి. దర్శకనిర్మాతలు నేను అలాంటి పాత్రలే చేయగలనని అలాంటి రోల్స్ ఇచ్చారు. దాంతో తప్పక చేయాల్సి వచ్చింది. వైవిధ్యభరితమైన పాత్రలను చేయాలనే తన ఆశ నిరాశ గానే మిగిలిపోయిందని రష్మీ చెప్పుకొచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పాత్రను ఒప్పుకుని చాలా పొరపాటు చేశాననే చెప్పాలి. ఇకపై అలాంటి పాత్రలను చేయనని చెప్పింది. మరి రష్మీ కోరుకున్న మంచి పాత్రలు ఆమె వద్దకు వస్తాయో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -