సినీ ఇండస్ట్రీలో పెద్ద సినిమా విడుదలకు సిద్ధమవుతుందంటే చాలు కచ్చితంగా వాటి చుట్టూ కాంట్రవర్సీలు అలుముకోవడం ఇటీవలి కాలంలో సాధారణమైపోయింది. ఆయా సినిమాల్లో కథాంశం వేరుగా ఉన్నప్పటికీ సినిమా విడుదలకు ముందే ఆయా చిత్రాల పేర్లు, నటులు లుక్ చూసి ఆ సినిమాల చుట్టూ కాంట్రవర్సీలు అలముకుంటున్నాయి.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి, దగ్గుపాటి రానాల సినిమాలపై కూడా ఇలాంటి ప్రభావమే పడింది. త్వరలోనే విడుదల కావాల్సిన ఈ సినిమాలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. దానికి ప్రధాన కారణం ఇటీవల ఛత్తీస్ గఢ్లో చోటుచేసుకున్న మావోయిస్టులు సృష్టించిన మరణకాండే. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య, దగ్గుపాటి రానా కథానాయకుడిగా వస్తున్న విరాట పర్వం సినిమాల మావోయిస్టుల నేపథ్యం ఉన్న కథాంశంతో వస్తున్నాయి.
మావోయిస్టుల కథాంశంతో వస్తున్న ఈ రెండు సినిమాలను విడుదల చేయకుండా నిలిపివేయాలని తాజాగా హైదరాబాద్ కు చెందిన యంటీ టెర్రరిజం ఫోరం డిమాండ్ చేసంది. అలాగే, సెన్సార్ బోర్డుకు సైతం ఫిర్యాదు చేసింది. ఈ రెండు సినిమాలను ఛత్తీస్ గఢ్ నక్సల్ ఘటనకు ముడిపెడుతూ రిలీజ్ ను అడ్డుకుంటున్నారు. కాగా, ఏప్రిల్ 30 విరాటపర్వం, మే 13న ఆచార్య సినిమాలు విడుదల కావాల్సి ఉన్నాయి.
కరోనా టీకా.. పంజాబ్ బ్రాండ్ అంబాసిడర్గా సోనూసూద్
దేశంలో కొత్తగా 1.52 లక్షల కరోనా కేసులు
72 గంటల్లో 12 మంది ఉగ్రవాదులు హతం !