- Advertisement -
ప్రస్తుతం నిఖిల్ తమిళ సినిమా ‘గణితన్’ను రీమేక్లో నటిస్తున్నాడు. సంతోశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ శాలినీ పాండే హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా ముహూర్తం అయిపోయింది. రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమా కోసం ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం. నిర్మాత ఠాగూర్ మధు ‘ముద్ర’ అనే టైటిల్ కాస్త ఆసక్తికరంగా, క్యాచీగా ఉండేలా చూసుకొని ఫిక్సయ్యారని తెలుస్తోంది.
ఈ సినిమా థ్రిల్లర్, కొంత మీడియా, ఇన్వెస్టిగేషన్ ఇతివృత్తంగా సినిమా తీసేందుకు కథ సిద్ధం చేశారు. కథకు తగ్గట్టుగా ‘ముద్ర’ అనే టైటిల్ సరిపోయేటట్టు ఉండడంతో ఫిక్స్ చేసేశారు. అయితే ఆ రిజిస్టర్ ఈ సినిమా కోసమో.. లేదా మరో సినిమా కోసం రిజిస్టర్ చేయించారా? అనేది తెలియడం లేదు.
https://www.youtube.com/watch?v=EeNbZb1gWp0