Friday, May 3, 2024
- Advertisement -

న‌ష్టాల్లో నిర్మాత రాధాకృష్ణ‌…

- Advertisement -

ఎన్నో అంచ‌నాలు, వివాదాల‌తో సంక్రాంతి పండుగ ముందు విడుద‌లైన ‘అజ్ఞాతవాసి’ అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుతోంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ 25వ సినిమా అని అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. త‌మ‌కు నిజంగా సంక్రాంతి పండుగ అనుకున్న వారికి నిరాశ‌ప‌రిచారు. దాదాపు 125 కోట్లకు అమ్ముడపోయిన ధియేట్రికల్ రైట్స్ తొలిరోజునే రూ.40 కోట్లు షేర్ వచ్చేసింది ఇంకేం సినిమాకు లాభాలు వ‌చ్చాయ‌నుకున్నారు. కానీ ఆ మ‌రుస‌టి రోజే సినిమాల డీలా ప‌డిపోయింది. రెండోరోజు రూ.5 కోట్లకు కూడా క‌లెక్ష‌న్స్ అందుకోలేక‌పోయాయి. మొదటి వారాంతం పూర్తయ్యే నాటికి కేవలం రూ.50 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. దీంతో ఆ సినిమా నిర్మాత బోరుమంటున్నాడు. కోట్లు ఖ‌ర్చు పెట్టి తీస్తే తీరా భారీ న‌ష్టాల్లో కూరుకుపోయాడు. దారుణ ప‌రాజ‌యం సినిమా మూట‌గ‌ట్టుకోవ‌డంతో న‌మ్ముకున్న నిర్మాత న‌ట్టేటా మునిగాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -