విభిన్న పాత్రలు చేస్తూ టాలీవుడ్కు పరిచయమైన నటుడు మలయాళంలో మాత్రం సూపర్స్టార్ అతడు. ‘జనతా గ్యారేజ్’లో జూనియర్ ఎన్టీఆర్ తమ్ముడిగా నటించిన ఉన్ని ముకుందన్ ఇటీవల వచ్చిన ‘భాగమతి’లో హీరో పాత్రగా చెప్పుకోవాల్సిందే. అనుష్కతో కలిసి నటించిన ముకుందన్ అందర్నీ ఆకట్టుకున్నాడు. అతడి నటన సినిమాకు ప్లసయ్యింది.
ఇప్పుడు ఆ హీరో మళయాలంలో తీస్తున్న ఓ సినిమాలో ఆడపాత్ర పోషిస్తున్నాడు. తెలుగులో పలు సినిమాల్లో కనిపించడానికి ప్రయత్నాలు చేస్తున్న ముకుందన్ మళయాలంలో మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మలయాళ సినిమా ‘చాణక్య తంత్రం’లో ఉన్ని ముకుందన్ కరిష్మా అనే హిజ్రా పాత్రలో కనిపించనున్నాడు.
ఈ పాత్ర కోసం బాగా కష్టపడ్డాడు. గంటల తరబడి కూర్చుని మేకప్ వేయించుకున్నాడు. సినిమాలో సహజంగా కనిపించాలి అనే ఉద్దేశంతో ఈ పాత్రకు ఉన్ని ముకుందన్ ఓకే చెప్పేశాడు. కన్నన్ తామరకుల్లం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ముకుందన్ ఆ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో శివదా శృతి రామచంద్రన్ హీరోయిన్లుగా చేస్తున్నారు.
అయితే ఈ పాత్ర విషయమై ముకుందన్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. తాను ఇప్పటి దాకా చేసిన పాత్రలు ఒక ఎత్తు ఈ కరిష్మా పాత్ర ఒక ఎత్తు అని అన్నాడు. మలయాళంలో ఉన్నిముకుందన్ గీత రచయిత, గాయకుడు. తన కెరీర్ను ప్లానింగ్గా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు.