వివాదాలకు మారుపేరుగా ఉన్న వర్మ మరోసారి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చేస్తున్నా అని ప్రకటించిన దగ్గరి నుండీ ప్రతీ రోజూ ఒక వివాదం లో నానుతూనే ఉన్నాడు ఆర్జీవి. ఒక పక్క బాలయ్య తన పద్దతిలో తాను ఎన్టీఆర్ బయోపిక్ కి ప్లాన్ చేసుకుంటూంటే అదే సమయం లో తాను కూడా అదే సబ్జెక్ట్ మీద సినిమా తీస్తున్నాని వర్మ ప్రకటించారు.
ఈ చిత్రానికి వైఎస్ఆర్సిపి లీడర్ రాకేష్ రెడ్డి నిర్మాత కావడంతో…. చాలా మందిలో ఈ సినిమా వెనక ఆ పార్టీ ఉందనే అనుమానాలు వచ్చాయి. ఇదే ఇప్పుడు పెద్ద వివాదాస్పదం అవుతోంది. దీనిపైన టీడీపీ నాయకులు చేసిన విమర్శలకు వర్మ ఘాటుగానె బదులిచ్చారు. అయితె ఇప్పుడు తాజాగా బ్రదర్ అనీల్ కుమార్ వర్మతో భేటీ కావడంతో ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
వైఎస్ జగన్ బావ, షర్మిల కి భర్తా అయిన బ్రదర్ అనీల్ కుమార్, రామ్ గోపాల్ వర్మలు పార్క్ హయాత్ హొటల్ లో భేటీ అయ్యారు. ఇద్దరూ రహస్యంగా దాదాపు గంటన్నరసేపు రహస్యంగా మంతనాలు జరిపారట. అంతే కాదు తన దగ్గర “తమసోమా జ్యోతిర్గమయా అనే సబ్జెక్ట్ ఉందనీ, దాన్ని సినిమాగా తీసే ఆలోచన ఉందంటూ కూదా వర్మకి చెప్పారట అనీల్ కుమార్.
బాలయ్య తీస్తున్న ఎన్టీఆర్ సినిమా పూర్తిగా ఆయన నటజీవితం, రాజకీయ విజయాలకే పరిమితం అట. య్యెస్సార్ పార్టీ దన్ను తోనే వర్మ సినిమా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ మీద రెండో సారి జరిగిన కుట్రనీ, ఆయన మీద చెప్పులు విసిరీ అవమానించి, ఆయనని గద్దెదింపిన వైనాన్నీ తెరమీదకి ఎక్కించే ప్రయత్నమే జరుగుతుంది. ఇక అలా గనక సినిమా తయారయితే విలన్ గా ఎవరుంటారో పక్కాగా చెప్పవలసిన అవసరం లేదు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పేలటానికి సిద్దంగా ఉన్న డైనమెట్ లా కొందరిని లక్ష్మీస్ ఎన్టీఆర్ భయపెడుతోంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు వస్తున్నాయి. ఇప్పటికె టీడీపీ నేతలు మండిపడుతున్న నేపధ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. చూడాలి వర్మ డైనమేట్ ఏమేర పేలుతుందో…తుస్సుమంటాదో.