మెగాస్టార్ చిరంజీవి దాదాపు పదేళ్ల తర్వాత ఖైదీ నెం.150 సినిమాలో నటించిన సంగతి తెల్సిందే. ఈ సినిమా రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. అయితే ఈ సినిమా తర్వాత చిరు మరో సినిమా మొదలు పెట్టలేదు కానీ.. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం తో మూడు నెలలుగా నిరంతరాయంగా షూటింగ్ లో పాల్గొంటూ చాలా బిజీగా ఉన్నాడు.
అయితే.. ఇప్పుడు ఈ షోకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈనెలాఖరుతో సీజన్ ను కంప్లీట్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఇక త్వరలో చిరు.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను ఆగస్టులో ప్రారంభించబోతున్నారు. అంతకు ముందు చిరంజీవి.. రెండు వారాల పాటు సమ్మర్ హాలీడే ట్రిప్ ను వేయబోతున్నాడు. ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో కలిసి సమ్మర్ వెకేషన్ కు వెళ్తూ ఉంటాడు.
{loadmodule mod_custom,Side Ad 1}
ఈ సారి మాత్రం పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి తన భార్య సురేఖతో హాలీడే ట్రిప్ కు వెళ్లబోతున్నారు. చిరంజీవి దంపతులు జపాన్ కు హాలీడే ట్రిప్ వేస్తున్నారు. జపన్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు వెళ్లి చిరంజీవి ఎంజాయ్ చేయబోతున్నాడు. చిరంజీవి జపాన్ నుండి తిరిగి రాగానే ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి సినిమా స్క్రిప్ట్ పనులో బిజీ కాబోతున్నాడు. ఆగస్టు నుండీ నిరంతరాయంగా ఉయ్యాలవాడ సినిమా కోసం అయిదు నెలలు చిరు కష్టపడనున్నారు. అందుకే ఈ హాలీడే ట్రిప్ అని మెగా వర్గాల వారు అంటున్నారు.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}hr2Zu1dRBEo{/youtube}
Related