Friday, May 24, 2024
- Advertisement -

వావ్ దటీజ్ చిరు.. కళ్లకు గంతలు కొట్టుకొని దోష ఛాలెంజ్‌!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల విరామం తర్వాత మళ్లీ వెండితెరపై తన సత్తా చూపిస్తున్నారు. వివివినాయక్ దర్శకత్వంలో ఖైదీ నెంబర్ 150 మూవీతో ఆయన మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి మూవీతో అలరించారు. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్నారు. ‘ఆహా’ నిర్వహిస్తోన్న సామ్‌జామ్ షోలో మెగాస్టార్ చిరంజీవి ఇటీవల పాల్గొన్న విషయం తెలిసిందే. క్రిస్మస్‌కు ఈ షో ప్రసారం కానుంది.

ఈ షోలో సమంత అడిగే చిలిపి ప్రశ్నలకు మెగాస్టార్ ఎంతో ఫన్నీగా సమాధానం చెబుతూ వచ్చారు. ఎప్పుడైనా సినిమా చూస్తూ ఏడ్చారా? అని ఆయనను సమంత ప్రశ్నించింది. దీనికి జవాబు చెబుతూ, తాను గతంలో ఓ సినిమాకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నానని, కిందకు వంగి కన్నీరు తుడుచుకుంటున్న సమయంలో లైట్స్‌ వేశారని, ఆ సమయంలో తాను పైకి లేచేసరికి ఓ పైట తన చేతిలో ఉందని.. అంటూ ఇంకా ఏదో నవ్వుతూ చెప్పారు.

ఆ తర్వాత మీ ఫేవరెట్ దోష ఛాలెంజ్ గురించి ప్రస్తావించారు.  షోలో ఆయన కళ్లకు గంతలు కట్టుకుని దోశ ఛాలెంజ్‌ను చేసి చూపించారు. ఏది ఏమైనా మెగాస్టార్ తర్వాత అన్నీ అంటూ ఫ్యాన్స్ తెగ సంతోషంలో మునిగిపోయారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -