Monday, April 29, 2024
- Advertisement -

కాస్టింగ్ కౌచ్ లో వాళ్లే బలవుతున్నారు : గాయత్రి గుప్తా

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో గాయత్రి గుప్తా పేరు తెలియని వారు ఉండరు. చాలా సినిమాలు చేసినప్పటికి ఫిదాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన బోల్డ్ స్టేట్‌మెంట్లతో బాగా ఫాపులర్ అయింది. తాజాగా ఆమె హీరోయిన్లపై షాకింగ్ కామెంట్స్ చేసింది. విషయంలోకి వెళ్తే.. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఎంత పెద్ద సంచలనం రేపిందో అందరికి తెలిసిందే. దీనిని శ్రీరెడ్డి తెరపైకి తీసుకువచ్చిందని చాలా మంది అనుకుంటారు.

కానీ, ఆమె కంటే ముందే కాస్టింగ్ కౌచ్‌పై గాయత్రి గుప్తా పోరాటం ప్రారంభించింది. ఛాన్స్ లు ఇస్తామని చెప్పి చాలా మంది మోసం చేశారని చెప్పింది. ఇక బిగ్ బాస్ యాజమానంపై కూడా ఈమె ఫైర్ అయింది. బిగ్ బాస్ లో ఆఫర్ ఇస్తామని చెప్పి.. ఏ సినిమాలు చేయకుండా చేశారు. చివరికి బిగ్ బాస్ లో కూడా ఆఫర్ ఇవ్వలేదని వాళ్లపై ఫైర్ అయింది. ఇక తాజాగా కాస్టింగ్ కౌచ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందన్న విషయం ఎప్పటి నుంచో చెబుతున్నా. అయితే, చాలా మంది నటిమణులు ఇష్టంతోనే చేస్తున్నారు.

కొందరు అవసరాల కోసం చేస్తున్నారు. వీళ్లలో అమాయకపు అమ్మాయిలే బలవుతున్నారు’ అని చెప్పుకొచ్చింది. ’గతంలో నేను చేసిన పోరాటానికి అంతగా సహకారం అందలేదు. తర్వాత మరికొందరు నాలా పోరాడడం వల్లే ఇండస్ట్రీ స్పందించింది. ఇందుకోసం ఓ కమిటీని కూడా వేశారు. ఇప్పుడు చాలా మంది బాధితులకు అది ఒక ఫ్లాట్‌ఫాం అయింది. దీంతో చాలా మంది నేరుగా వెళ్లి ఫిర్యాదు చేయగలుగుతున్నారు’ అని గాయత్రి చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -